English | Telugu

మోక్షజ్ఞ కన్నా ముందే కెమెరా ముందుకు తేజస్విని!

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కన్నా ముందే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కెమెరా ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Nandamuri Tejaswini)

కొంతకాలంగా బాలకృష్ణ సినిమా వ్యవహారాల్లో తేజస్విని చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే, అఖండ-2 సినిమాకి ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్నిరోజులుగా తెరవెనుక ఉన్న ఆమె, ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడానికి తేజస్విని అంగీకరించారట. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. త్వరలోనే యాడ్ ప్రసారం కానుందని అంటున్నారు. మరి తేజస్విని భవిష్యత్ లో సినిమాల్లో కూడా నటిస్తారేమో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.