English | Telugu

బాలయ్య క్రేజ్.. ఒకేసారి పది కోట్లు పెరిగిన రెమ్యూనరేషన్!

కొందరు హీరోలు ఒక్క హిట్ రాగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు. ఆ తర్వాత ఫ్లాప్ లు ఎదురైనా, నిర్మాతలకు నష్టాలు వచ్చినా అక్కడి నుంచి కిందకి దిగరు. అయితే ఇలాంటి కొందరు హీరోలున్న పరిశ్రమలో.. పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోని అరుదైన హీరో నందమూరి బాలకృష్ణ.

బాలకృష్ణను నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో అంటారు. సినిమా హిట్ అవ్వగానే రెమ్యూనరేషన్ పెంచే రకం కాదు ఆయన. క్రేజ్ ని, మార్కెట్ ని పట్టించుకోకుండా రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ముందునుంచి బాలయ్యకి అలవాటు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు అంత ఆసక్తి చూపిస్తారు.

ప్రస్తుతం బాలకృష్ణ మరే ఇతర సీనియర్ స్టార్ లేనంత ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు బాగా లాభాలు చూస్తున్నారు. అందుకే బాలయ్య అడగకుండానే నిర్మాతలు ఆయన పారితోషికం పెంచుకుంటూ పోతున్నారు.

'అఖండ' సినిమాకి బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు మాత్రమే. ఆ సమయంలో బాలయ్య కంటే తక్కువ మార్కెట్ ఉన్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. కానీ బాలయ్య ఎప్పుడూ ఆ లెక్కలు పట్టించుకోలేదు. 'అఖండ' ఘన విజయం సాధించడంతో.. 'వీరసింహారెడ్డి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. అది కూడా విజయం సాధించడంతో 'భగవంత్ కేసరి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు తదుపరి సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ.28 కోట్లు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య తన తదుపరి సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్యకు రూ.28 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సితార సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో ఉన్నారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో ఆయన సినిమాలు రూ.150 కోట్లకి పైగా బిజినెస్ చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు బాలయ్య అడిగినా, అడగకపోయినా రెమ్యూనరేషన్ పెంచుతున్నారు. 2021 లో వచ్చిన 'అఖండ'కి రూ.10 కోట్ల పారితోషికం అందుకోగా, రెండేళ్లలోనే అది రూ.28 కోట్లకి చేరింది అంటే ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.