English | Telugu

సిద్ధాపూర్ ను సందర్శించిన శ్రీమంతుడి శ్రీమతి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న ఊళ్లను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సందర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బుర్రిపాలెం ఊరికి వెళ్లి వచ్చిన ఆమె, ఈ సారి తెలంగాణాలోని సిద్ధాపూర్ ఊరికి చేరుకున్నారు. మహేష్ బాబు ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణాలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సిద్ధాపూర్ చేరుకున్న ఆమె, ఊరంతా పర్యటించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్, మహేష్ బాబులు ఈ ఊరికి వస్తారని ఆమె చెప్పారు. ఊరికి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ తో చర్చిస్తున్నామని ఆమె తెలిపారు. బుర్రిపాలెంలో పర్యటించిన సమయంలో కూడా ఆ ఊరి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారామె. తాము దత్తత తీసుకున్న ఈ రెండు ఊర్లనూ మోడల్ విలేజ్ లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.