English | Telugu

ఇకపై కొడుకుల కోసమే నాగార్జున..!

కుర్ర హీరోలు కూడా ఒక హిట్టు కొట్టడానికే నానా తిప్పలూ పడుతుంటే, కింగ్ నాగార్జున మాత్రం వరసగా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేశారు. తన తండ్రి చూపించిన బాటలోనే, వైవిధ్యాన్ని, విభిన్న సినిమాల్నీ నమ్ముకుని విజయబాటలో పయనిస్తున్నారు నాగ్. ఆయన హ్యాట్రిక్ హిట్ సినిమా ఊపిరి. ఈ సినిమా కమర్షియల్ గానే కాక, మానసికంగా కూడా నాగ్ కు బాగా దగ్గరైంది. ఇప్పటికీ చాలా చోట్ల సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ సినిమా సక్సెస్ ను పునస్కరించుకుని, థ్యాంక్స్ గివింగ్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ, తనకు హ్యాట్రిక్ హిట్స్ ను అందించిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఒక ఇంట్రస్టింగ్ వ్యాఖ్య చేశారు. తర్వాత రాఘవేంద్రరావుతో హాథీరాం బాబా సినిమాను మొదలెట్టబోతున్నాను. నాతో సోగ్గాడు తీసిన కళ్యాణ్ కృష్ణతో చైతూ మూవీ, వంశీ డైరెక్షన్లో అఖిల్ మూవీ ఫైనల్ చేద్దామనుకుంటున్నాం. ఇప్పటి వరకూ వాళ్ల కెరీర్ల మీద మనసు పెట్టలేదు. ఈ ఏడాది మాత్రం అదే పనిలో ఉండాలనుకుంటున్నాను. ఇది అభిమానులకు నా ప్రామిస్ అంటూ నాగార్జున మాట్లాడారు. దీంతో నాగార్జున తన ఎక్స్ పీరియన్స్ తో కొడుకుల కోసం మూవీలు సెలక్ట్ చేస్తే, వాళ్ల కెరీర్లు గాడిలో పడటం కన్ఫామ్ అంటూ హ్యాపీ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.