English | Telugu

రోజుకొక్కసారైనా అతనితో మాట్లాడకపోతే తోచదు..అయ్యప్పస్వామి భక్తుణ్ని కద

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)ప్రస్తుతం 'తుడురం'(Thudarum)అనే మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 25 న రిలీజైన ఈ థ్రిల్లర్ డ్రామా తెలుగులో కూడా హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. మోహన్ లాల్ సరసన సీనియర్ నటీమణి శోభన(shobana)జత కట్టగా తరుణ్ మూర్తి(tharun moorthy)దర్శకత్వంలో ఎం రెంజిత్ నిర్మించాడు.

తాజాగా మోహన్ లాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నలభై ఎనిమిదేళ్ల సినీ కెరీర్‌లో నేను సినిమాను ప్రేమించినంతగా దేన్నీ ప్రేమించలేదు. విశ్రాంతి తీసుకోవడం, ఖాళీగా ఉండటమంటే నచ్చదు. ఈ కారణంతోనే ఒక సినిమా సెట్స్‌ మీద ఉండగానే నాలుగైదు చిత్రాలకు ఓకే చెబుతుంటాను. మమ్ముట్టి(Mammootty)నా ప్రాణస్నేహితుడు. రోజుకి ఒక్కసారైనా తనతో మాట్లాడనిదే నాకు తోచదు. మా మధ్య పోటీ ఉందని అనుకుంటు ఉంటారు. కానీ మా మధ్య అంతకంటే మంచి స్నేహం ఉంది. తనతో కలిసి ఇప్పటి వరకు యాభై సినిమాల దాకా చేశాను. ఇంకా మరిన్ని చిత్రాల్లో కలిసి పని చేయాలనేదే నా కోరిక.

అయ్యప్ప స్వామి(Ayyappaswami)భక్తుణ్ని, అప్పుడప్పుడు మాల వేసుకుని కాలినడకన శబరిమల వెళ్లి ఇరుముడి సమర్పించి వస్తుంటా'అని మోహన్ లాల్ తెలిపారు. మోహన్ లాల్ గత నెల మార్చి 27 న 'ఎల్ 2 ఎంపురాన్ 'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీయడంతో ఆయా వర్గాల వారికి మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.