English | Telugu

చిరు, చ‌ర‌ణ్‌.. దొందు దొందే!

మెగా హీరోలు అటు చిరంజీవి, ఇటి రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఒకేలా ఆలోచిస్తున్నారు. త‌మ సినిమాల విష‌యంలో ఇద్ద‌రూ ఒకే పంథా ఫాలో అవుతున్నారు. చిరంజీవి క‌త్తి, రామ్‌చ‌ర‌ణ్ తని ఒరువ‌న్‌... ఇద్ద‌రూ రీమేక్ క‌థ‌ల‌నే ఎంచుకొన్నారిప్పుడు. రిస్క్ లేని ప్ర‌యాణం సాగించ‌డం బెట‌ర్ అని ఈ తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ ఫిక్స‌యిపోయిన‌ట్టున్నారు. అంతేకాదు.. రీమేక్‌లో ఉన్న‌ది మ‌క్కీకి మ‌క్కీ దించేయాల‌ని, సొంత బుర్ర వాడి సినిమాని పాడుచేయొద్దంటూ... ద‌ర్శ‌కులు చెప్పేశార‌ట‌. చిరు సినిమాకి వినాయ‌క్ ద‌ర్శ‌కుడ‌న్న సంగ‌తి తెలిసిందే.

చిరుతో ఇది వ‌ర‌కు వినాయ‌క్ తీసిన ఠాగూర్ కూడా రీమేక్ సినిమానే. అన్న‌య్య చిరుతో ఎలా ఉండాలో వినాయ‌క్‌కి బాగా తెలుసు. కాబ‌ట్టి.. క‌త్తి రీమేక్ విష‌యంలో ఉలాంటి ప్ర‌యోగాల జోలికీ వెళ్ల‌కుండా.. త‌మిళంలో ఉన్న‌ది ఉన్న‌ట్టు త‌ర్జుమా చేస్తున్నాడ‌ట‌. చివ‌రాఖ‌రికి క‌త్తి సినిమాకి తెలుగులో పేరు పెట్ట‌డానికీ.. పెద్ద‌గా ఆలోచించ‌లేద‌ని తెలుస్తోంది. క‌త్తి అని తెలుగుకీ అదే పేరు పెడ‌దామనుకొన్నారు. అయితే ఆల్రెడీ క‌ల్యాణ్‌రామ్ ఈ పేరుతో ఓ సినిమా తీసేశాడు. కాబ‌ట్టి.. ఇప్పుడు క‌త్తిలాంటోడు అంటూ కత్తి సినిమాని గుర్తు తెచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశారు.

మ‌రోవైపు తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నాడు చ‌ర‌ణ్ కూడా. బ్రూస్లీతో చర‌ణ్‌కి ఓ భారీ ఫ్లాప్ త‌గిలింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యోగాల జోలికి వెళ్లి రిస్క్ తీసుక‌వ‌డం ఇష్టం లేదు. పైగా కిక్ 2తో సురేంద‌ర్ రెడ్డి కూడా ఓ డిజాస్ట‌ర్ అందుకొన్నాడు. చ‌ర‌ణ్ ఏం చెబితే అది చేయ‌డం మినహా.. మ‌రో గ‌త్యంత‌రం లేదు. త‌ని ఒరువ‌న్‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టు తీయ‌మ‌ని.. మార్పులు చేసి మాతృక‌లోని ఫ్లేవ‌ర్‌ని పాడుచేయెద్ద‌ని క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశాడ‌ట చ‌ర‌ణ్‌. దాంతో.. అటు వినాయ‌క్‌, ఇటు సురేంద‌ర్ రెడ్డి కాస్త పీల‌వుతున్నార‌ని వినికిడి. ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే తీయాలంటే తామెందుకు..?? అంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నార్ట‌. మొత్తానికి తండ్రీ కొడుకుల ధాటికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు బ‌ల‌వుతున్నారు. అంతిమంగా ఈ రీమేక్ ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో? అది ఎవ‌రి మీద ప‌డుతుందో..?.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.