English | Telugu

మరోసారి వార్తల్లోకి మంచు విష్ణు.. ఏం చేశాడో తెలుసా?

ఇటీవలికాలంలో మంచు ఫ్యామిలీ పలు రకాల వివాదాలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వారి కుటుంబ వ్యవహారం ఒక సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు రావడం లేదు. ఇప్పుడు మంచు విష్ణుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కన్నప్ప సినిమా రిలీజ్‌ హడావిడిలో ఉన్న విష్ణు తను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కూడా బిజీగానే కనిపిస్తున్నాడు. తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని విద్య, నిత్యావసరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణ మారణకాండ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ ఆ కాల్పుల్లో మృతి చెందారు. దీంతో ఆ ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తోంది.

ఘటన తర్వాత మధుసూదన్‌ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. మధుసూదన్‌ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాదు, జనసేన పార్టీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తాజాగా హీరో మంచు విష్ణు మధుసూదన్‌ కుటుంబాన్ని కలిశారు. శుక్రవారం కావలిలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధుసూదన్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మధుసూదన్‌ సతీమణి కామాక్షికి, వారి పిల్లలకు ధైర్యం చెప్పారు. పిల్లలను తాను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు విష్ణు. తిరుపతిలో అనాథలను చేరదీసి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విష్ణు.. ఇప్పుడు మధుసూదన్‌ కుటుంబాన్ని కూడా దత్తత తీసుకోవడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను చేస్తున్న ఈ మంచి పనులను ప్రశంసిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.