English | Telugu

వెంకన్న సన్నిధిలో బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్..!

పవర్ స్టార్ సర్దార్ రిలీజైపోయింది. టాక్ ఎలా ఉన్నా, అందరూ ఒకసారైనా సర్దార్ చూసేస్తారు. ఇక ఇప్పుడు సినీజనాల తర్వాతి చూపులు పవర్ స్టార్ మీది నుంచి సూపర్ స్టార్ మీదకు మళ్లుతున్నాయి. ' సీతమ్మ వాకిట్లో ' డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో ' బ్రహ్మోత్సవం ' లాంటి మరో క్లాస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు మహేష్. షూటింగ్ గురించి ఇప్పటికే చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, వాటన్నింటినీ పట్టించుకోకుండా, తమ పనిని నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు మూవీ టీం.

మే లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మహేష్ అండ్ కో, ఈ నెల 24న తిరుపతిలో, ఆడియో రిలీజ్ వేడుకను చేయబోతున్నారు. సినిమా టైటిల్ బ్రహ్మోత్సవం బట్టే, స్టోరీకి వెంకన్న వేడుకకు ఏదో రిలేషన్ ఉంటుందని అర్ధమవుతూనే ఉంది. అందుకే సినిమాకు కరెక్ట్ గా ఉంటుందని, తిరుపతిలోనే ఆడియో రిలీజ్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. భారీగా నిర్వహించబోతున్న ఈ ఫంక్షన్ కు, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. మరి ఈ హాట్ సమ్మర్ లో, బ్రహ్మోత్సవం కూల్ మూవీగా పేరు తెచ్చుకుంటుందా..? చూడాలి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.