English | Telugu

పెళ్లి పీటలెక్కబోతున్న మహేష్ బాబు హీరోయిన్..!

చూడబోతే, ఈ ఏడాదంతా బాలీవుడ్ ముదురు భామలకు పెళ్లిళ్ల యోగం పట్టినట్టుంది. మొన్ననే ప్రీతిజింతా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే, లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి మహేష్ హీరోయిన్ చేరింది. మహేష్ బాబుతో టక్కరిదొంగలో చిందేసిన బిపాషాబసు ఆ తర్వాత బాలీవుడ్ లో ట్రై చేసి మంచి పబ్లిసిటీ, పేరు తెచ్చుకున్నా హిట్స్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రస్తుతం సరైన సినిమాలు లేక ఫిట్ నెస్, యోగాసనాల వీడియోలు చేస్తున్న ఈ భామ, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడింది. అంతకు ముందు జాన్ అబ్రహాంతో చాలా డీప్ గా లవ్ స్టోరీ నడిపినప్పటికీ, అది ఫెయిల్యూర్ గా మిగిలిపోవడంతో చాలా కాలం పాటు, నాకు ప్రేమ వద్దూ, పెళ్లి వద్దు అంటూ కబుర్లు చెప్పిన బిప్స్, ఆ తర్వాత కరణ్ గ్రోవర్ కు ఫ్లాట్ అయిపోయింది. బిప్స్ కూడా లవ్ ఫెయిల్యూర్ తో రేఖ, సుస్మితాసేన్ లలా సింగిల్ గా ఉండిపోతుందేమోనని జాలిపడ్డ బాలీవుడ్, ఆమె పెళ్లి న్యూస్ విని రిలీవ్ అవుతోంది. ఏప్రిల్ 28న ముంబైలోని ఒక స్టార్ హోటల్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. ఏప్రిల్ 30న ముంబైలోని ఆమె ఇంటిలో పెళ్లి జరగబోతోంది. మెహందీకి అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించిన బిపాషా, పెళ్లికి బాలీవుడ్ మొత్తాన్ని ఆహ్వానించింది. పెళ్లి తంతు మొత్తం బెంగాలీ పద్ధతిలో జరపబోతున్నారని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.