English | Telugu

'లియో' మూవీ ఫస్ట్ రివ్యూ.. లోకేష్ మార్క్ మిస్ అయింది!

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లియో'. ఈ యాక్షన్ థ్రిల్లర్ నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో 'లియో'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇది 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్, విజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా. భారీ అంచనాలతో విడుదలైన లియో.. ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో పరవాలేదు అనే టాక్ తో సరిపెట్టుకుంది.

'ఖైదీ', 'విక్రమ్' తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన మూడో సినిమా లియో. హిమాచల్ ప్రదేశ్ లో కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎపిసోడ్ తో సినిమా ప్రారంభమైంది. హైనాతో ఫైట్ ఎపిసోడ్ తో విజయ్ ఇంట్రడక్షన్ ఆకట్టుకుంది. సీరియల్ కిల్లర్ గ్యాంగ్‌ తో తలపడే సన్నివేశం, ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించాయి. అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. ఇంటర్వెల్ కి ముందు 40 నిమిషాలు బాగానే ఆకట్టుకుంది.

సంజయ్ దత్, త్రిష.. విజయ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలతో సెకండాఫ్ మొదలైంది. అయితే ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా డల్ అయింది. లోకేష్ మార్క్ కనిపించలేదు. సంజయ్ దత్, అర్జున్ పాత్రలు తేలిపోయాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేదు. పతాక సన్నివేశాలు కూడా భారీగా ఉన్నప్పటికీ, సాగదీసినట్లుగా అనిపించాయి. అలాగే యాక్షన్ డోస్ కూడా ఎక్కువైంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని లింక్ చేస్తూ వచ్చిన సన్నివేశాలు మాత్రం బాగానే ఉన్నాయి.

కథలో కొత్తదనం లేనప్పటికీ తన మార్క్ స్క్రీన్ ప్లే తో లోకేష్ సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ అందులో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లుగా, కథనం నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. అనిరుధ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సీరియస్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. లోకేష్ గత చిత్రాల మాదిరిగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేయడం అనుమానమే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.