English | Telugu

రెబెల్‌ స్టార్‌ని భయపెట్టారు!!

మొదటిసారి మైకుపట్టుకొని మాట్లాడాలంటే భయంగా వుందని రెబెల్‌ స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. బాహుబలి ఆడియో వేడుకకు గెస్ట్ గా హాజరైన ఆయన బాహుబలి గురించి ఏం చెప్పాలో తెలియడం లేదని అన్నారు. ‘‘ట్రైలర్‌ చూశాను, అద్భుతంగా ఉంది. నిన్న డిల్లీలో ఉన్నప్పుడు అక్కడున్న పొలిటిషియన్స్‌ అందరూ రాజమౌళి ఎవరు? బాహుబలి సినిమా ఎంటని అడిగారు.

రాజమౌళి ఇండియన్‌ సినిమాని ఇంటర్నేషనల్‌ స్థాయికి తీసుకెళ్లగలిగే గొప్ప దర్శకుడని వారికి చెప్పాను. ఆ గ్రాండియర్‌ ట్రైలర్‌లో కనపడుతుంది. చాలా గొప్ప కథ అని, చాలా గొప్పగా తీస్తున్నారని, రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమా అని పొరుగు రాష్ట్రాలవాళ్లు చెప్పుకుంటున్నారు. గర్వంగా ఉంది. ఇంటర్నేషనల్‌ స్థాయికి మనం తక్కువ కాదు. ఆ స్థాయి సినిమాలు మనం సినిమాలు తీయగలమని వారంటున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ గొప్ప రైటర్‌. ఆయనతో చాలా కాలంగా నాకు పరిచయం ఉంది. కథ మీద మంచి పట్టున్న దర్శకుడు.

రాజమౌళి ప్రతి ఇంచ్‌ను గొప్ప తీయాలని చూస్తాడు. అందుకే కొద్దిగా ఆలస్యమైనా మనం గొప్ప సినిమాని చూడబోతున్నాం. ఇండియన్‌ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి నాకంటే వయసులో చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలు తీయాలని ప్రపంచ ఖ్యాతి పొందాలని ఈ బాహుబలిని రెండు పార్ట్‌లుగానే కాదు. ఐదు పార్ట్‌లుగా తీయాలని కోరుకుంటున్నాను’’ అని రెబెల్‌ స్టార్‌ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.