English | Telugu

తన డైరెక్టర్లనే వారసులకు ప్రిఫర్ చేస్తున్న నాగార్జున

తనయుల కెరీర్ల కోసం కింగ్ నాగార్జున కొత్త దారిని ఫాలో అవుతున్నారు. అఖిల్ మొదటి సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో రెండో సినిమా కోసం చాలా కసరత్తు చేసిన నాగ్, ఇప్పుడు డైరెక్టర్ ను ఫిక్స్ చేశారట. నాగ చైతన్య తర్వాతి సినిమాకు ' సోగ్గాడే.. ' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ను కేటాయించిన నాగ్, అఖిల్ తర్వాతి సినిమాను ' ఊపిరి ' డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతిలో పెడదామనుకుంటున్నాడట. ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించి, హీరో పెర్ఫామెన్స్ ను ఎలివేట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు వంశీపైడిపల్లి. ఊపిరి చూసుకున్న తర్వాత, అఖిల్ కు వంశీ అయితేనే కరెక్ట్ హిట్ ఇవ్వగలడనే ఒపినీయన్ కు కింగ్ వచ్చేశాడట. మీడియాతో మాట్లాడుతూ, సినిమాపై అఖిల్, వంశీ చర్చించుకుంటున్నారని, త్వరలోనే వాళ్లిద్దరి కాంబోలో మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని రివీల్ చేశాడు. అన్నపూర్ణ బ్యానర్లోనే, ఎమోషనల్ లవ్ స్టోరీగా అఖిల్ రెండో సినిమా వచ్చే అవకాశం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.