English | Telugu

'కిక్ 2'ను 20నిమిషాలు కత్తెరించారు

మాస్ మహారాజ్ రవితేజ కిక్ 2 సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ తో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ వెంటనే యాక్టివ్ అయి 20నిమిషాల నిడివి కట్ చేసి రీరిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ద్వితీయార్థంలో సినిమా లెంత్ తగ్గి స్క్రీన్ ప్లే గ్రిప్ పెరిగిందని అంటున్నారు. మాస్ మహారాజ్ స్టయిల్ కి తగ్గట్టే మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ మిక్స్ చేసి సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిలాస్ పూర్ నేపథ్యంలో లొకేషన్లు రకూల్ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అన్న టాక్ వచ్చింది. రేసుగుర్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది కావడంతో తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయని రిపోర్ట్ వచ్చింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.