English | Telugu

'కేజీఎఫ్-3' అప్డేట్ వచ్చేసింది.. 'సలార్'తో మల్టీవర్స్!

కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం పెంచేసిన సినిమా అంటే 'కేజీఎఫ్' అనడంలో ఎలాంటి సందేహం లేదు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఇప్పటిదాకా రెండు భాగాలు వచ్చాయి. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన 'కేజీఎఫ్-1' భారీ విజయాన్ని అందుకోగా.. ఇక 'కేజీఎఫ్-2' అయితే రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు 'కేజీఎఫ్-3'కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం.

'కేజీఎఫ్-2' విడుదలై నేటితో(ఏప్రిల్ 14) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసిన హోంబలే ఫిలిమ్స్.. అందులో 'కేజీఎఫ్-3' ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 'కేజీఎఫ్-2' సినిమా చివరిలోనే 'కేజీఎఫ్-3' ఉంటుందని చూపించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. మరోవైపు ప్రశాంత్ నీల్ 'సలార్'తో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత 'ఎన్టీఆర్ 31' చేయాల్సి ఉంది. దీంతో ఇప్పట్లో 'కేజీఎఫ్-3' సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కేజీఎఫ్ మేకర్స్ మాత్రం ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ.. తాజాగా విడుదల చేసిన వీడియోలో 'కేజీఎఫ్-3' ఉంటుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఆ వీడియోలో 1978 నుంచి 1981 వరకు రాకీ భాయ్ ఎక్కడున్నాడు? అనే ప్రశ్నను సంధించారు. మరోవైపు ఇది మల్టీవర్స్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' మొదలైనప్పటి నుంచి ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న సినిమా అని ప్రచారం జరుగుతోంది. 'సలార్' కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని, మొదటిభాగం చివరిలో కేజీఎఫ్ రాకీ భాయ్ ఎంట్రీ ఇస్తాడని న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు 'సలార్-2', 'కేజీఎఫ్-3' రెండూ ఒక్కటే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేశాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.