English | Telugu

ప్రముఖ హీరోకి కీర్తి సురేష్ క్షమాపణలు.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ  

అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో ప్రముఖ హీరోయిన్ 'కీర్తి సురేష్'(Keerthy suresh)కూడా ఒకరు. కేరళ కి చెందిన కీర్తి బాల్యం నుంచే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతు, రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలజ క్యారక్టర్ లో క్యూట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, మొదటి చిత్రంతోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత చేసిన నేను లోకల్, అజ్ఞాతవాసి,సర్కారివారి పాట, దసరా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు కూడా కీర్తి రేంజ్ ని పెంచాయి. మహానటి తో అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ లెజండ్రీ యాక్ట్రస్ సావిత్రిగారి క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించి, సావిత్రి గారిని మన కళ్ళ ముందుకు మళ్ళీ సజీవంగా నిలబడేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 12 న 'ఆంథోనీ తటిల్' నిప్రేమ వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ప్రముఖ ఓటిటి ఛానల్ జీ 5 లో జగపతి బాబు(Jagapathi Babu)వ్యాఖ్యాతగా 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో(Jayammu NischayammuRaa Talk show) స్ట్రీమింగ్ అవుతు వస్తుంది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ కి కీర్తి సురేష్ గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు అంథోని నేను పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాం. ఇంట్లో వాళ్ళకి నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాను. వాళ్ళు వెంటనే ఓకే అన్నారు. ఇంట్లో వాళ్లకి చెప్పడం కంటే ముందే జగపతిబాబు గారికి చెప్పాను. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నా ప్రేమ గురించి తెలుసు. అలాంటి తక్కువ మందిలో జగపతి బాబు కూడా ఒకరు. జగపతి బాబు గారిని నమ్మాను కాబట్టే చెప్పాను. కానీ ఆయన్ని పెళ్ళికి పిలవలేదు అని చెప్పింది. అనంతరం ఈ విషయంపై జగపతిబాబుని క్షమాపణ కూడా కోరింది.

జగపతి బాబు, కీర్తి సురేష్ లు గుడ్ లక్ సఖి లో కలిసి నటించారు. సదరు చిత్ర కథ ప్రకారం కీర్తి సురేష్ కి కోచ్ గా జగపతి బాబు కనపడ్డాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మిస్ ఇండియాలో కూడా కలిసి చెయ్యడంతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే కీర్తి సురేష్ గత ఏడాది బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ ఏడాది ఆగస్టులో తనే ప్రధాన పాత్రలో 'రివాల్వర్ రీటా' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి రౌడీ జనార్ధన్ లో చేస్తుంది. ఇక కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. మళయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు వంద చిత్రాల వరకు హీరోయిన్ గా చేసింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో 'పున్నమి నాగు' లో కూడా జత కట్టి అలరించింది.తండ్రి సురేష్ మలయాళంలో అనేక హిట్ చిత్రాలని నిర్మించిన నిర్మాత.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.