English | Telugu

కన్నడ భాషపై చేసిన కామెంట్స్ పై కమల్ వివరణ  

కొన్ని రోజుల క్రితం 'లోకనాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)లెజండ్రీ మేకర్ 'మణిరత్నం'(Mani Rathnam)దర్శకత్వంలో తెరకెక్కిన 'థగ్ లైఫ్'(Thug Life)ఆడియో ఫంక్షన్ చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(SIvaraj Kumar)హాజరయ్యాడు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'మనమంతా ఒక్కటే. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందే అనే వ్యాఖ్యలు చేసాడు. ఈ మాటలతో కన్నడ నాట ఆ రాష్ట్ర భాషా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కమల్ ని దుర్భాషలాడుతున్నాయి. కన్నడ ప్రజలకి కమల్ ఈ రోజు సాయంత్రం లోపు క్షమాపణ చెప్పాలి. లేదంటే జూన్ 5 న విడుదలవుతున్న 'థగ్ లైఫ్' ని కర్ణాటక వ్యాప్తంగా బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంపై కమల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు భాష గురించి నేను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవే గాని మరో ఉద్దేశం లేదు. ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పదు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు నాకు చెప్పారు. నేను ఏ విషయంలో నైనా తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను. భారత దేశం ప్రజాస్వామిక దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్మడంతో పాటు గౌరవిస్తాను.ఈ విషయంలో ప్రజలు జ్యోక్యం చేసుకోవద్దు. భాష గురించి మాట్లాడే అర్హత నాతో సహా ఇప్పుడున్న రాజకీయనాయకులకి లేదని చెప్పుకొచ్చాడు.

' థగ్ లైఫ్' లో కమల్ తో పాటు శింబు, అభిరామి, త్రిష, నాజర్, జోజు జార్జ్, తనికెళ్ళ భరణి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ పతాకంపై కమల్, మణిరత్నం అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.