English | Telugu

ఎన్టీఆర్‌పై రాజ‌మౌళికి న‌మ్మ‌కం లేదా?

ఎన్టీఆర్ -రాజ‌మౌళిల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌... హ్యాట్రిక్ విజ‌యాల్ని న‌మోదు చేసుకొన్నారు. అస‌లు ఒక‌రి విజ‌య ప్ర‌స్థానం మొద‌లైందే.. మ‌రొక‌రితో. అందుకే ఈ జోడీ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ఎన‌లేని గురి! య‌మ‌దొంగ త‌ర‌వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌లేదు రాజ‌మౌళి. జ‌క్క‌న్నతో జ‌ట్టు క‌ట్ట‌డానికి ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నా.. ఈ విష‌యంలో రాజ‌మౌళి మాత్రం నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాడు. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి సినిమా ఎన్టీఆర్‌తోనే అన్న‌ది దాదాపుగా ఖాయ‌మైపోయింది.

అయితే ఇప్పుడు కూడా రాజ‌మౌళి.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలా, వ‌ద్దా అని ఆలోచిస్తున్నాడట‌! గ‌రుడ అనే స‌బ్జెక్ట్ ఎన్టీఆర్ కోస‌మే అని అనుకొన్నా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అవ్వాల‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే గ‌రుడ‌కు దాదాపు వేయి కోట్ల బ‌డ్జెట్ అవ‌స‌రం. ఆ క‌థ‌లో ఎన్టీఆర్‌కి స‌రిప‌డినా, వేయి కోట్లు తిరిగి రాబ‌ట్టే స‌త్తా తార‌క్‌కి లేద‌న్న‌ది రాజ‌మౌళి భ‌యం. అందుకే గ‌రుడ స్థానంలో మ‌రో క‌థ సిద్థం చేసుకొంటున్నాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యమై ఎన్టీఆర్ కూడా రాజ‌మౌళిపై గుర్రుగా ఉన్నాడ‌ట‌. చేస్తే గ‌రుడ చేద్దాం, లేదంటే మానేద్దాం అంటున్నాడ‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.