English | Telugu

నేను తండ్రినే..ఆ బాధ నాకూ తెలుసు: ఎన్టీఆర్

క్యాన్సర్‌తో బాధపడ్తున్న చిన్నారి శ్రీనిధిని సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పరామర్శించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌కి చిన్నారి శ్రీనిధి వీరాభిమాని. తమ కుమార్తెకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే ఇష్టం కావడంతో, ఆ విషయాన్ని ఫేస్‌ బుక్‌ ద్వారా ప్రచారం చేశారు. ఇది తెలుసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, స్వయంగా వెళ్లి శ్రీనిధిని పరామర్శించాడు. చిన్న జ్వరం వస్తేనే పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారనీ, తండ్రిగా తనకూ ఆ కష్టం తెలుసన్న జూనియర్‌ ఎన్టీఆర్‌, తన పరామర్శతో కొంతైనా పాపకు సాంత్వన కలుగుతుందని ఆశిస్తున్నాననీ, త్వరగా శ్రీనిధి కోలుకోవాలని కోరుకుంటున్నాననీ అన్నాడు. పాప పరిస్థితిని చూస్తోంటే గుండె తరుక్కుపోతోందనీ, ఆమె తల్లి దండ్రుల ఆవేదనను తాను అర్థం చేసుకోగలననీ, శ్రీనిధి కుటుంబానికి సానుభూతి తెలపడంతోపాటు, తనకు చేతనైన సహాయం అందిస్తానని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.