English | Telugu

హీరోయిన్లు కాదు.. ఐటెమ్ గాళ్స్‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు ఈత‌రం క‌థానాయిక‌ల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు హీరోయిన్లు ఎవ‌రూ లేర‌ని, ఉన్న‌వాళ్లంతా ఐటెమ్ గాళ్సేన‌ని వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ఓ స‌న్మాన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు దాస‌రి. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక‌ల్ని టార్గెట్ చేస్తూ.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇది వ‌ర‌కు సిల్క్‌స్మిత‌, జ్యోతిల‌క్ష్మి, జ‌య‌మాలిని, డిస్కోశాంతి లాంటి క‌థానాయిక‌లు ఉండేవాళ్ల‌ని, వాళ్లు కేవ‌లం ఐటెమ్ గీతాల‌కే ప‌రిమిత‌మ‌య్యేవార‌ని, ఇప్పుడు క‌థానాయిక‌లే ఐటెమ్ గాళ్స్‌గా మారిపోయార‌ని అన్నారు. ఇది వ‌ర‌కు సినిమాకి ఒక‌టో రెండో ప్ర‌త్యేక గీతాలుండేవి.. ఇప్పుడు ప్రతి పాటా అలానే ఉంటుంద‌ని చుర‌కేశారు. అందుకే క‌థానాయిక‌ల జీవిత కాలం ఐదారేళ్ల‌కు మించ‌డం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది వ‌ర‌కు కూడా దాస‌రి ఇలానే హీరోయిన్ల‌పై విరుచుకుప‌డ్డారు. సినిమా ఫంక్ష‌న్ల‌కు రారుగానీ, అవార్డుల కార్య‌క్ర‌మాల‌కైతే ఎగేసుకొస్తార‌న్నారు. అస‌లు క్ర‌మ‌శిక్ష‌ణ లేని క‌థానాయిక‌ల‌కు అవార్డులివ్వొద్ద‌న్నారు. ఇప్పుడు మ‌రోసారి వాళ్ల‌ని టార్గెట్ చేస్తూ మాట్టాడ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.