English | Telugu

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

-పేరు ఏంటో తెలుసా!
-ఖచ్చితంగా ఆ నటుడే
-ఫస్ట్ సినిమా ఎవరితో


'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.


బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఎన్టీఆర్(Ntr)రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్(Allu Arjun),రవితేజ(Raviteja) వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ 2015 లో వచ్చిన టెంపర్ తర్వాత ఏ మూవీని నిర్మించలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా BG బ్లాక్ బస్టర్స్(BG Blockbustersఅనే సరికొత్త బ్యానర్ ని ఏర్పాటు చేసాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటిస్తు లోగోని విడుదల చేసాడు. ఈ బ్యానర్ ద్వారా హృదయాలను తాకే కథలు, ఎమోషనల్ స్టోరీలు, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తానని ఎక్స్ వేదికగా తెలిపాడు. BG అంటే Bandla ganesh అనే అర్ధం తెలిసిందే.


Also read: జననయగాన్ రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు


కొంత కాలం నుంచి చాలా ఇంటర్వూస్ లో బండ్ల గణేష్ మాట్లాడుతు మళ్ళీ సినిమాలు నిర్మించి తన సత్తా చాటుతానని చెప్తూ వస్తున్నాడు. దీంతో చెప్పిన మాట ప్రకారం సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. కాకపోతే బ్యానర్ పేరు మార్చడం చర్చినీయాంశ మయ్యింది. ఏది ఏమైనా అభిమానులతో పాటు ప్రేక్షకులు గణేష్ రీ ఎంట్రీ కి సోషల్ మీడియా వేదికగా వెల్ కమ్ చెప్తున్నారు. మరి ఫస్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.