English | Telugu

అఖిల్ కోసం ఓ ఐటెమ్ గీతం

అక్కినేని ఇంటి కొత్త హీరో అఖిల్ ఎంట్రీకి స‌రంజామా సిద్ధ‌మ‌వుతోంది. ఈసినిమాని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా నిల‌బెట్టాల‌ని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అఖిల్ ఎంట్రీ బాధ్య‌త వి.వి.వినాయ‌క్‌పై పెట్టారు. ఆయ‌న ఈ క‌థ‌కి అద‌న‌పు హంగులు అద్దుతున్నారు. వినాయ‌క్ సినిమా అంటే భారీ యాక్ష‌న్ హంగామాతో పాటు, ర‌స‌వ‌త్త‌ర‌మైన గీతాలూ ఉంటాయి. ఈసినిమాలోనూ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కోసం ఐటెమ్ గీతం ఉండాల్సిందే అని... చిత్ర‌బృందం తీర్మాణించింద‌ట‌. ఆ పాట‌లో ఓ అగ్ర క‌థానాయిక‌తో డాన్స్ చేయించాల‌ని వినాయ‌క్ భావిస్తున్నారు. తెలుగునాట టాప్ క‌థానాయిక‌గా వెలుగొందుతున్న తార చేత అఖిల్‌తో స్టెప్పులు వేయించాల‌ని టీమ్ భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల‌ను దింపి - ఆ పాట‌కి మ‌రింత హైప్ తీసుకురావాల‌నే ప్లాన్‌లో ఉన్నార్ట‌. అనూప్ రూబెన్స్‌, దేవిశ్రీ ప్ర‌సాద్.. ఇద్ద‌రిలో ఒక‌ర్ని సంగీత ద‌ర్శ‌కుడిగా సెలెక్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. దేవి అయితే త‌న‌కు కంఫ‌ర్ట్‌గా ఉంటుంద‌ని వినాయ‌క్ చెబుతున్నాడ‌ట‌. దేవికి ఐటెమ్ గీతాల స్పెష‌లిస్టు అనే ముద్ర ఉంది. దాంతో ఈ పాట మ‌రింత సూప‌ర్బ్‌గా వ‌చ్చే ఛాన్సుంద‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కం పెంచుకొంటోంది. మ‌రి ఈ ఐటెమ్ గీతంలో క‌నిపించే క‌థానాయిక‌లెవ‌రో మ‌రి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.