English | Telugu

హీరోయిన్‌కి మత్తు మందు ఇచ్చి రేప్‌.. హీరోని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా బయటికి వచ్చారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఒక హీరోయిన్‌ పోలీసులను ఆశ్రయించింది. తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ హీరోని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. 2014లో కన్నడలో ‘ఉలిదవరు కందంతే’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. కన్నడ హీరో రక్షిత్‌శెట్టి ఈ చిత్రానికి కథ, దర్శకత్వం చేయడంతోపాటు హీరోగా కూడా నటించాడు. ఈ చిత్రాన్ని 2017లో ‘రిచీ’ పేరుతో తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలో నివిన్‌ పాలీ, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. ఆ తర్వాత 2020లో ‘రిచి’ చిత్రంలోని కాన్సెప్ట్‌తోనే హీరో, దర్శకుడు, నిర్మాత అయిన హేమంత్‌ కన్నడలో అదే పేరుతో రీమేక్‌ చేశాడు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్‌ తాజాగా హేమంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హేమంత్‌ తనపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు హేమంత్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఈ అరెస్ట్‌తో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడిరది.

‘రిచి’ చిత్రంలో తనను హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్న హేమంత్‌.. అడ్వాన్స్‌గా 60 వేల చెక్‌ను ఇచ్చాడనీ, అయితే అది బౌన్స్‌ అయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. షూటింగ్‌ సమయం నుంచే వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె ఆరోపించారు. అసభ్యకరమైన దుస్తులు వేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. షూటింగ్‌ పూర్తయిన తర్వాత హోటల్‌ రూమ్‌కి రావాల్సిందిగా తరచూ వేధించేవాడని తెలియజేసింది. సినిమా ప్రమోషన్స్‌ పేరుతో తనను ముంబై తీసుకెళ్లి కూల్‌డ్రిరక్‌లో మద్యం కలిపి ఇచ్చాడని, తను మత్తులో ఉన్నప్పుడు నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేశాడని ఆరోపించింది. ఆ వీడియోలను చూపించి తనను లొంగదీసుకోవడానికి ట్రై చేశాడని, ఒప్పుకోకపోవడంతో సినిమాకి సంబంధించి సెన్సార్‌ చేయని కొన్ని క్లిప్పింగులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా తన తల్లిని చంపేస్తానని హేమంత్‌ బెదిరించాడని ఆమె తెలిపింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య ప్రమోషన్స్‌ విషయంలో పెద్ద గొడవ జరిగింది. అగ్రిమెంట్‌ ప్రకారం ఆ నటి ప్రమోషన్లకు సహకరించడం లేదని ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడు హేమంత్‌. అప్పుడు సినిమా పెద్దలు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి హేమంత్‌ వేధింపులు మరింత పెరిగాయని, అందుకే పోలీసుల్ని ఆశ్రయించానని బాధితురాలు చెప్తున్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ కేసును విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. హేమంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి.