English | Telugu

తాగి బైకును ఢీకొట్టిన తనీష్..


డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెలబ్రిటీలు పట్టుబడటం ఫైన్ కట్టడం వారికి మామూలు విషయమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో హీరో తనిష్ కూడా బుక్కయ్యాడు. తాగిన మైకంలో కారు నడిపి.. బైకుపై ఉన్న వ్యక్త్తిని ఢీకొట్టాడు. ఈ నెల 1వ తేదీన తనీశ్ రాత్రి 9 గంటలకు తాగి కారు డ్రైవ్ చేస్తూ జూబ్లీహీల్స్ రోడ్డులో బైకుపై ఉన్న వ్యక్తిని ఢీ కొట్టాడు. అయితే బాధితుడు సురేష్ తన బైకుపైనే చేజ్ చేసి మరీ తనీష్ను అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. దీంతో తనీష్ కోర్టుకు హాజరు కాగా న్యాయమూర్తి కేవలం 50 రూపాయల జరిమానా విధించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.