English | Telugu

24 ఆడియో ఫంక్షన్ కు భారీగా వచ్చిన జనం..!

ఒకప్పుడు తమిళ సినిమాలు రిలీజైపోయిన తర్వాత, ఇక్కడ ఎవరైనా చూసి నచ్చితే, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్ పెంచుకునే వ్యూహంలో భాగంగా, డైరెక్ట్ గా తమిళం వాళ్లే తెలుగులోకి రిలీజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న సూర్య, విక్రమ్ లాంటి వాళ్లందరూ ఇదే దారిని ఫాలో అవుతున్నారు. నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో సూర్య ' 24 ' తెలుగు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. సోమవారం అయినా, తమిళ సినిమా అయినా ఆడియన్స్ మాత్రం చాలా భారీగానే ఈ వేడుకకు రావడం విశేషం. సూర్య మాట్లాడుతున్న సమయంలో, విజిల్స్ వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. గత రెండు మూడేళ్లుగా సరైన హిట్ లేకపోయినా, సూర్య సినిమాలకు జరుగుతున్న బిజినెస్, పెరుగుతున్న ఫ్యాన్ బేస్, తెలుగు మార్కెట్ లో సూర్య క్రేజ్ ను చూపిస్తోంది. మూవీకి నిర్మాత కూడా తనే కావడంతో, రిలీజ్ ను హీరో సూర్య స్వయంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే 24 ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమా హిట్ అయితే, సూర్య తెలుగు మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనడంలో డౌట్ లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.