English | Telugu

కుమారిను తప్పించేశారట పాపం..!

వరుణ్ తేజ్, శ్రీను వైట్ల సినిమా జూన్ 1 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. సినిమాలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠీ, హెబ్బాపటేల్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మొదట వరుణ్ అండ్ కాజల్ అని అనుకున్నారు. కానీ వయసులో కాజల్ పెద్దగా కనిపించిందో ఏమో కానీ, ఆమెను తప్పించి ఆమె స్థానంలో లావణ్యను తీసుకున్నారు. ఇక హెబ్బా పటేల్ కూడా ఈ కాలేజ్ లవ్ స్టోరీలో బబ్లీగా ఉండే క్యారెక్టర్ చేస్తుందని అందరూ గెస్ చేశారు. అయితే ఫిల్మ్ నగర్లోని గుసగుసల ప్రకారం, సినిమా నుంచి కుమారిని తప్పించే ఆలోచన చేస్తున్నారట. అసలు కారణం తెలియకపోయినా, మూవీ యూనిట్ మాత్రం, వరుణ్ మరీ హైట్ అయితే, హెబ్బా మరీ పొట్టి గా ఉంది. అందుకే కాస్త హైట్ గా ఉన్న అమ్మాయైతే బెస్ట్ అనుకుంటున్నాం అని చెబుతున్నారట. కుమారి21కు ఈ ఆఫర్ చాలా అవసరం అని చెప్పాలి. సినిమా హిట్టైతే ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్పీడ్ అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ లాస్ట్ మినిట్ ఛేంజ్ ఎందుకొచ్చిందో గానీ, ఈ పాప మంచి ఛాన్స్ కోల్పోయినట్టే. ప్రస్తుతం కాస్త ఖాళీగానే ఉన్న మెగా హీరోయిన్ రెజీనాను ఈ అవకాశం వరించినట్టు సమాచారం. రెజీనా ఆఫర్ వెనుక ఎవరి హస్తం ఉంది చెప్మా...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.