English | Telugu

గుండమ్మ కథ రీమేక్ అవసరమా..?

క్లాసిక్స్ అన్న పేరు ఊరికే రాదు. కలకాలం నిలిచి ఉండేవే క్లాసిక్స్. అలాంటి సినిమాలను రీమేక్ చేయాలనుకోవడం, కత్తి మీద సామే. సహజంగానే భారీ అంచనాలతో ఉండే క్లాసిక్స్ ను మళ్లీ తీసి ఆ అంచనాలను అందుకోవడం దాదాపు అసాధ్యం. బాలీవుడ్ లో జంజీర్ అనే క్లాసిక్ ను రీమేక్ చేసి రాం చరణ్ అలాగే దెబ్బతినేశాడు. అందుకే సాధారణంగా అలాంటి ప్రయోగాలు జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది. కానీ తాజాగా ఈడో రకం ఆడోరకం సక్సెస్ మీట్ లో మోహన్ బాబు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గుండమ్మ కథ రీమేక్ రైట్స్ కొని మళ్లీ తీస్తానని ఆయన చెబుతున్నారు. ఇది విన్న చాలా మంది పాత సినిమా లవర్స్ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే గుండమ్మ కథ సినిమాకు ఉన్న ఫ్యాన్స్ తక్కువ కాదు. తెలుగునాట గుండమ్మ కథ, మాయాబజార్ సినిమాలకు ఎన్ని తరాలైనా తరగని ఆదరణ ఉంటుంది. మాయాబజార్ ను సుమన్ హీరోగా పెట్టి సాంఘీకంగా తీసి దాసరి ఆల్రెడీ దెబ్బతినేశారు. ఇప్పుడు ఆయన శిష్యుడైన మోహన్ బాబు గుండమ్మ కథను తీసేస్తానంటున్నారు. ఆలోచన బాగానే ఉంది. హీరోలు కూడా ఉన్నారు. కానీ అసలైన సూర్యకాంతం పాత్రకు ఈ కాలంలో ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఆమె పాత్ర పండకుంటే సినిమా కనీసపు ఆకర్షణ కూడా ఉండదు. ఇలా క్లాసిక్ రీమేక్ లో ఎన్నో సమస్యలుంటాయి. ఇప్పటి వరకూ పాత చిత్రరాజాల్ని రీమేక్ చేసి సక్సెస్ కొట్టిన దాఖలాలు దాదాపు లేవు. కాబట్టి వాటిని కిందికి లాగకుండా, ఆ రేంజ్ లోనే ఉండనివ్వడం మేలేమో..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.