English | Telugu

అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి..ఇప్పుడు రాజమౌళి..గుణశేఖర్

రుద్రమదేవి సినిమా హిట్ కావడంతో.. సక్సెస్ మీట్ లో గుణశేఖర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ''ప్రకాష్ రాజు గారు ఈ సినిమా నేను మొదలుపెట్టిన తరువాత నాలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసారు. ఆయన మాటలు నాలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. అనుష్క లేకపోతే రుద్రమదేవి లేదు. మాతో పాటు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉంది. తన స్త్రెంగ్థ్ చూసి నాకు ఆశ్చర్యమేసేది. రుద్రదేవుడు, రుద్రమదేవి అనే రెండు పాత్రల్లో తను చూపించిన వేరియేషన్ అధ్బుతం. గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. చివరికి అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు. తను స్క్రీన్ పై ఉన్న యాబై నిమిషాల్లో ప్రతి నిమిషం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. నా కెరీర్ లో ఒక పాత్రకు ఇంత అప్లాజ్ రావడం మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కథలను సినిమాగా స్టూడియో అధికారులో, బడా నిర్మాతలు మాత్రమే చేయగలరు. నేను సినిమా చేయడానికి చాలా మంది చాలా రకాలుగా సహకరించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, అనుష్క, రానా ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించారు. ఈ సినిమా చూసిన వారందరూ నాకు కంగ్రాట్స్ చెప్పకుండా.. థాంక్స్ చెబుతున్నారు. గొప్ప చరిత్రను తెలుగువాడు తీసినందుకు గర్వంగా ఉందని అందరూ చెబుతున్నారు. కొత్త చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి ఇప్పుడు నేను ఇలాంటి చిత్రాలు తీయడం మొదలు పెట్టాం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను''.. అని చెప్పారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.