English | Telugu

గుణ మ‌ళ్లీ అంత రిస్క్ చేస్తాడా..??

రుద్ర‌మ‌దేవిని భారీగా, త‌న క‌ల‌ల‌కు అనుగుణంగా తెర‌కెక్కించాడేమో గానీ, ఆ సినిమాని అనుకొన్న స‌మ‌యంలో విడుద‌ల చేసే విష‌యంలో మాత్రం చేతులెత్తేశాడు గుణ‌శేఖ‌ర్‌. దాదాపు రూ.60 కోట్ల వ్య‌యంతో గ్రాండ్ లెవిల్లో తీసిన ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడు సెప్టెంబ‌రు 4న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని గుణ ఫిక్స‌య్యాడు. సెప్టెంబ‌రు 4 అంటే.. చాలా స‌మ‌యం ఉంది. ఈలోగా ఏమైనా జ‌రగొచ్చు. ఈ సినిమా విడుద‌లైనా, పెట్టుబ‌డి తిరిగి ద‌క్కించుకోవ‌డం కూడా అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఇంత వ‌ర‌కూ సినీ ప‌రిశ్ర‌మ‌లో సంపాదించిందంతా గుణ ఈ సినిమాకి పెట్టుబ‌డిగా పెట్టేశాడ‌ని టాక్‌. అయితే.. రుద్ర‌మ‌దేవి త‌ర‌వాత గుణ మ‌రో భారీ సినిమా చేయ‌డానికి ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఓ వార్త వినిపిస్తోంది.

గుణ‌శేఖ‌ర్ త‌న సొంత బ్యాన‌ర్‌లో `ప్ర‌తాప రుద్రుడు` అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాడు. ఇది కూడా హిస్టారిక‌ల్ మూవీనే. రుద్ర‌మ‌దేవి తీసేట‌ప్పుడే ప్ర‌తాప రుద్రుడు ఐడియా త‌ట్టింద‌ట గుణ‌శేఖ‌ర్‌కు. ఎలాగైనా ఈ సినిమా చేసి తీరుతా... అనే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకీ ఓ స్టార్ హీరో, భారీ బ‌డ్జెట్‌, కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డి కావాలి. ఆ మాట‌కొస్తే రుద్ర‌మ‌దేవి కంటే పెద్ద రిస్క్‌. అయినా స‌రే.. గుణ‌శేఖ‌ర్ జంక‌డం లేద‌ట‌.

నిజంగా రుద్ర‌మ‌దేవి బాగా ఆడి, పెట్టుబ‌డి తిరిగొస్తే... గుణ మ‌ళ్లీ రిస్క్ చేయ‌డంలో త‌ప్పులేదు. అదే.. లెక్క తేడా చేస్తే మాత్రం గుణ అంత రిస్క్ చేయ‌డ‌మో అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. ఒక‌వేళ చేద్దామ‌నుకొన్నా గుణ‌శేఖ‌ర్‌ని న‌మ్మి స్టార్ హీరో డేట్లు ఇచ్చేది కూడా అనుమాన‌మే. ప్ర‌తాప రుద్రుడు ప్రాజెక్ట్ ఇప్పుడు రుద్ర‌మ‌దేవిపైనే డిపెండ్ అయి ఉంది. రుద్ర‌మ‌దేవి హిట్ట‌యితేనే... ప్ర‌తాప‌రుద్రుడు సెట్స్‌పైకి వెళ్తాడు. అదీ లెక్క‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.