English | Telugu

రామ్ చరణ్ టార్గెట్ మిస్సయింది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' దసరాకి మిస్ అయ్యే అవకాశ౦ వున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కాగా అక్టోబర్ 1 న రిలీజ్ చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ అందుకొనే అవకాశ౦ లేదట. ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణవంశీ కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే ప్రకాష్‌రాజ్, జయసుధ పార్ట్ రీషూట్ వల్ల సినిమా చిత్రీకరణ లేట్ అయింది. కానీ ఫారిన్‌ షెడ్యూల్స్‌, పాటల షూటింగ్స్‌ వగైరా బ్యాలెన్స్‌ ఉడడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతాయని ఇన్‌సైడ్ న్యూస్. పైగా డైరెక్టర్ కృష్ణవంశీ ఎడిటింగ్‌లో ఉంటే కథ నెల రోజుల్లో ఫస్ట్‌ కాపీ రెడీ చేయడమనేది సాధ్యం కాదట. కాబట్టి గోవిందుడు టార్గెట్ మిస్ అయ్యే చాన్సులు ఎక్కువని ఇండస్ట్రీ సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.