English | Telugu

'గోపాల గోపాల' ఆడియో హైలైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ గెస్ట్ గా కనిపించారు. అభిమానుల కోలాహలం, సినీతారల సందడి మద్య జరిగిన ఈ ఆడియో విడుదల హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఈ మూవీలో తనది చాలా సింపుల్ క్యారెక్టర్ అన్నారు. పవన్ తో సినిమా చేయాలనుకున్న తన కోరిక ఈ మూవీతో తీరిందన్నారు. పవన్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని తెలియగానే చాలా సంతోషం కల్గిందన్నారు. తన అభిమానులు విక్టరీ అందిస్తే, పవన్ అభిమానులు పవర్ చూపిస్తారని.., ఇద్దరి ఫ్యాన్స్ కలిపి ఈ సంక్రాంతికి పవర్ ఫుల్ విక్టరీ అందిస్తారని చెప్పారు.

ఆడియో రిలీజ్ లో మాట్లాడిన పవర్ స్టార్, ఉద్వేగానికి లోనయ్యారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నా గుండెనిండా అభిమానులే ఉన్నారు. నేనెప్పుడూ దేవుడ్ని ఏది కోరలేదు. కానీ కొందరు ఫ్యాన్స్ వచ్చి ఒక్క హిట్ సినిమా ఇవ్వు అని కోరటంతో.., అది కావాలని దేవుడిని ప్రార్థించాను. ‘గబ్బర్ సింగ్’ రూపంలో అది జరిగింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు.., కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఫ్యాన్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి, ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తాను. నాకు కథలు ఎంపిక చేయటం రాదని కొందరు చెప్తారు కానీ.., కథలు ఎలా ఎంచుకోవాలో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే అన్నయ్య చిరంజీవి నేర్పించారు.

కష్టపడినా ఫలితం దక్కకపోతే చాలా బాధేస్తుంది. కొన్నిసార్లు ఆ బాధ నాకూ కలిగింది. అని పవన్ చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ గతంలో వెంకటేష్ తో ఉన్న చనువుతో, బాగా నటించగలిగినట్లు చెప్పారు. మిగతా సినిమాల్లో పాటలు వస్తే నడుస్తూ వెళ్లే తాను ఈ మూవీలో అయితే కాస్త డాన్స్ చేశానని చెప్పారు. అనూప్ పాటలు నచ్చి అతడిని తీసుకోగా తన నమ్మకం నిలబెట్టాడని మెచ్చుకున్నారు. అందువల్లే ‘గబ్బర్ సింగ్2’ తర్వాతి సినిమాకు కూడా అనూప్ సంగీతం అందిస్తాడని చెప్పారు. ఇలా పవన్, విక్టరీ స్పీచ్ ల తో పాటు కామెడి కేరింతలు, డాన్స్ ల కోలాహలం మద్య ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల వేడుక ఒక ఉత్సవంలా జరిగింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.