English | Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు మూవీ

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో ఒక మూవీ తయారవుతోందని విశ్వసనియ వర్గాల ద్వారా అందిన సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన "సింహా" వంటి బ్లాక్ బస్టర్ వంటి హిట్టిచ్చిన తర్వాత, దాసరి నారాయణరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా "పరమవీరచక్ర" చిత్రంలో నటించారు.

ఇది నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది. అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులను కూడా బాగా నిరాశపరిచింది. ఈ సినిమాలో నటించటం వల్ల నందమూరి బాలకృష్ణ సరైన నిర్ణయాలు తీసుకోకుండా, మొహవాటాలకు పోయి దాసరి వంటి వారి దర్శకత్వంలో నటించి ఫ్లాపులిస్తున్నారనీ, అందుకని నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీవాసు గతంలో గోపీచంద్ హీరోగా "లక్ష్యం" చిత్రానికీ, రామ్ హీరోగా "రామ రామ కృష్ణ కృష్ణ" చిత్రానికి దర్శకత్వం వహించగా, మొదటి చిత్రం సూపర్ హిట్టయితే రెండవ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

అలాంటి శ్రీవాసు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమాలో నటించటానికి అంగీకరించారట. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో రాబోయే ఈ మూవీ ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.