English | Telugu

రెండు సెస్సేషనల్ సినిమాలకు దేవీ శ్రీ సంగీతం..!

దేవీ మ్యూజిక్ ఒక మ్యాజిక్. సాంగ్స్ రిలీజైన రోజే మంచి పేరు తెచ్చుకున్నాయంటే, అవి ఖచ్చితంగా దేవీశ్రీ పాటలే అయి ఉంటాయి. అంతలా ఆడియన్స్ నాడి పట్టేసుకున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, మ్యూజిక్ పరంగా హిట్ ఆల్బమ్ గా నిలవడం దేవీ పాటల ప్రత్యేకత. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో టాప్ హీరోలందరికీ మ్యూజిక్ అందించాడు దేవీ. మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే శంకర్ దాదా రెండు పార్ట్స్, అందరివాడు సినిమాల్లో మ్యూజిక్ ఇరగదీసేశాడు. బాలకృష్ణ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉండే లెజండ్ కు కూడా దేవీయే మ్యూజిక్. తాజాగా వీళ్లిద్దరి సెన్సేషనల్ మూవీస్ కి దేవీ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే చిరు స్వయంగా సర్దార్ ఆడియో ఫంక్షన్లో, నా నెక్స్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ ఇవ్వు అని దేవీతో పబ్లిగ్గానే చెప్పేశారు. మరో వైపు బాలయ్య క్రిష్ కాంబినేషన్లో వస్తున్న వందో సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం కూడా డిఎస్పీకి వచ్చినట్టే. క్రిష్ చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే ఇద్దరూ కలిసి త్వరలోనే పనిచేయబోతున్నారని అర్ధమవుతోంది. త్వరలో క్రిష్ బాలయ్య వందో సినిమానే చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు దేవీ రెండు ల్యాండ్ మార్క్ మూవీస్ కు డిఎస్పీ జాక్ పాట్ కొట్టేశాడు. ఏడాదికి మినిమం నాలుగు సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు దేవీ. ఈ ఏడాది నేను శైలజ, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్ పాటలతో ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉన్న దేవీ చిరు బాలయ్యలకు ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడో చూడాలి మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.