English | Telugu

పూరి చెంప ఛెళ్లుమ‌నిపిస్తాడ‌ట‌

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌పై ఓ పెద్దాయ‌న రెచ్చిపోయారు.కోపంతో ఊగిపోయారు. చెంప‌ఛెళ్లుమ‌నిపిస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌నెవ‌రంటారా..? దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ అనే ప్ర‌జాగాయ‌కుడు. ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేషీలోనూ ప‌నిచేస్తున్నారు. మెద‌క్‌లో తెలంగాణ పున‌ర్నిర్మాణం అభివృద్ధి అనే టాపిక్‌పై సెమినార్ జ‌రిగింది. అందులో ఈయ‌న ముఖ్య వ‌క్త‌. స‌డన్‌గా ఆయ‌న టాపిక్ సినిమాల‌పై మ‌ళ్లింది. స‌మాజంలో చెడుని ప్రేరేపిస్తున్న ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ అనీ, ఆయ‌న త‌న సినిమాలో మ‌హిళ‌ల్ని, గురువుల్ని కించప‌రిచేలా చూపిస్తాడ‌ని, సందేశాత్మ‌క చిత్రాలు తీస్తే చంక‌నాకిపోతార‌న్న స్టేట్‌మెంట్లు ఇచ్చి మిగిలిన ద‌ర్శ‌కుల్ని చెడ‌గొడుతున్నాడ‌ని శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. ఇలాంటి పూరి జ‌గ‌న్నాథ్ త‌న ముందుకొస్తే చెంప‌ఛెళ్లుమ‌నిపిస్తా.. అంటున్నాడీయ‌న‌. మ‌రి ఇందుకు పూరి ఎలాంటి కౌంట‌ర్ ఇస్తాడో.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.