English | Telugu

పెద్ద దిక్కును కోల్పోయిన టాలీవుడ్..దాసరి కన్నుమూత

తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకులు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో కిమ్స్‌లో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మూత్ర పిండాలలో సమస్య తలెత్తండంతో ఆయనకు ప్రస్తుతం హిమో డయాలసిస్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో దాసరి కన్నుమూశారు. వారం రోజుల కిందట కిమ్స్‌లో చేరిన దాసరి ఆరోగ్యం కొంతవరకు విషమించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. ఆయన కోలుకుంటున్నారని..త్వరలో ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షించారు. కానీ అందరి ఆశలను తలక్రిందులు చేస్తూ దాసరి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో టాలీవుడ్ కన్నీరుమున్నీరవుతోంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.