English | Telugu

'కొరియ‌ర్‌' క‌త్తిరించినా... క‌నిక‌రించ‌లేదు

వాయిదాల ప‌ర్వం దాటుకొని కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్‌.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాపై విడుద‌ల‌కు ముందు నుంచీ ఎలాంటి అంచ‌నాలూ లేవు. కాబ‌ట్టి రిజ‌ల్ట్ కూడా షాకింగ్ అనిపించ‌లేదెవ్వ‌రికీ. అస‌లే రెండుగంట‌ల సినిమా ఇది. అయినా స‌రే.. గౌత‌మ్ మీన‌న్ చివరి క్ష‌ణాల్లో 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశాడ‌ట‌. దాంతో గంట 45 నిమిషాల సినిమాగా మారింది. ఇంత క‌త్తిరించినా ప్రేక్ష‌కులు మాత్రం క‌నిక‌రించ‌లేదు. చివ‌రి క్ష‌ణాల్లో ట్రిమ్ చేసినా, సినిమా ఇంకా లెంగ్తీగా, బోరీంగ్‌గా త‌యారైందంటే.. ద‌ర్శ‌కుడి స్ర్కీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కొరియ‌ర్ బోయ్‌తో వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న నితిన్ కి స్పీడ్ బ్రేక‌ర్లు ఎదురైన‌ట్టుంది ప‌రిస్థితి. వాయిదాలు ప‌డుతూ విడుద‌లైన ఏ సినిమా హిట్ అయిన‌ట్టు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే లేదు. ఆ సెంటిమెంట్ ని కొరియ‌ర్ బోయ్ కూడా కంటిన్యూ చేసింది. !

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.