English | Telugu

టెంప‌ర్‌ లో కామెడీ కలుపుతారట!

పూరి - ఎన్టీఆర్‌లు క‌ల‌సి ఆంధ్రావాలా ఫ్లాప్ కి బ‌దులు తీర్చుకొన్నారు. క‌థ‌పై దృష్టి పెడితే.. ఎలాంటి ప‌లితం వ‌స్తుందో వీళ్ల‌కు అర్థ‌మైంది టెంప‌ర్‌తోనే. సినిమా అంతా బాగానే ఉంది గానీ.. పూరి సినిమాల్లో ఉండే వినోదం పాళ్లు త‌గ్గాయి అని ప్రేక్ష‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యం పూరి దృష్టికీ వెళ్లింది. అందుకే... ఇప్పుడు కొత్త‌గా కొన్ని సీన్లు యాడ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌థ‌కి అడ్డంగా ఉన్నాయ‌ని..ట్రిమ్మింగ్‌లో భాగంగా అలీ - స‌ప్త‌గిరి మ‌ధ్య తీసిన కొన్ని సీన్స్ లేపేశారు. ఇప్పుడు వాటిని మ‌ళ్లీ యాడ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ సెకండాఫ్‌లో క‌లుపుతార‌ట‌. దాంతో సీరియ‌స్ నెస్ నుంచి కాస్త రిలీఫ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సీన్స్ యాడ్ అవుతున్నాయి. మ‌రి ఈ సీన్స్ వ‌ల్ల వ‌సూళ్ల‌లో ఎంత మార్పు వ‌స్తుందో చూడాలి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.