English | Telugu

హాట్ టాపిక్ : చిరంజీవి మీసకట్టు


గత మూడు దశాబ్దాలుగా,తెలుగు చిత్రసీమను మకుటం లేని మారాజుగా ఏలిన చిరు, తన 150వ సినిమాకోసం ఇంతలా తర్జనభర్జన పడటం ఏమిటన్నది.ఆయన అభిమానుల్ని ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న..ఎట్టకేలకు కత్తి రీమేక్ కు ఆయన తలఊపారన్న సంగతి వాళ్లకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా,ఇక్కడ సమాధానం దొరకని మరో ప్రశ్న ఏంటంటే..ఇంత పెద్ద చిత్రసీమలో,ఆయనకు కథలే దొరకలేదా...బాలీవుడ్ తర్వాత అంత పెద్దదిగా పేరొందిన టాలీవుడ్ లో, మెగా స్టామినాకు తగ్గ కథను సిద్ధం చేయగల డైరెక్టరే లేడా..? తన జీవితంలో అత్యంత కీలకమైంది 150 వ సినిమా..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన ఛరిష్మా తగ్గింది..మెగా ఫ్యాన్స్ అందరూ గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ గా మారిపోయారు...అంతేకాక ,తన పుట్టిల్లుగా ఆయనే చెప్పుకునే సినిమా ఫీల్డ్ లోకి రీఎంట్రీ..మరి ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాకోసం,ఆల్రెడీ తమిళ తంబీలు తీసిన స్టోరీనే ఆయన తీసుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనేది ఆయన అభిమానుల ప్రశ్న..

తీసేది స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కావచ్చు..నటించేది మెగా స్టార్ కావచ్చు..కానీ చూసేది మాత్రం ప్రేక్షకులు కదా...ఆల్రెడీ ట్విస్ట్ లన్నీ తెలిసిపోయిన మూవీ కథతో,చిరు వినాయక్ లు ఏమేరకు సక్సెస్ ను చూస్తారన్నదే ఇక్కడ ప్రధానాంశం...లేటెస్ట్ గా చిరు మీసకట్టుతో కనిపించడం జనాల్లో కొద్దిగా ఇంట్రస్ట్ ను తీసుకురాగలిగినా,అది కూడా నెగటివ్ గా మారడం విచిత్రం..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.