English | Telugu

ఎన్టీఆర్‌, ప‌వ‌న్ వ‌దిలేస్తే... చిరు ప‌ట్టుకొన్నాడు

చిరంజీవి 150వ సినిమాలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కూ చిరు 150వ సినిమా పూరి జ‌గ‌న్నాథ్‌తో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత వినాయ‌క్ రేసులోకి వ‌చ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో అతిథి పాత్ర చేసి, 150వ సినిమా మైలురాయి అందుకొంటాడ‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు మ‌రో మ‌లుపొచ్చింది. చిరంజీవి ఓ త‌మిళ రీమేక్‌లో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని, అదే... చిరు 150వ సినిమా అవుతుంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు ఓ న్యూస్ లీక్ చేశాయి.

విజ‌య్ న‌టించిన త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం `క‌త్తి`. ఈసినిమాని రీమేక్ చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ముందు ప‌వ‌న్‌కి ఈ క‌థ వినిపించారు. త‌ను సినిమా చూసి `నో` చెప్పాడు. ఎన్టీఆర్ కూడా ఈ రీమేక్ చేయ‌డానికి స‌ముఖ‌త చూపించ‌లేదు. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ని టాక్‌. క‌త్తి రీమేక్ హ‌క్కులు ఠాగూర్ మ‌ధు ద‌గ్గ‌ర ఉన్నాయి. మ‌ధుకీ, చిరుకీ మంచి సాన్నిహిత్యం ఉంది. మ‌ధు సినిమా అంటే అది చిరు ఓన్ బ్యాన‌ర్ లాంటిదే. అందుకే చిరు ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని తెలుస్తోంది.

భూసేక‌ర‌ణ‌, మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ క‌త్తి. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కీ ఈసినిమా బాగా హెల్ప్ అవుతుంద‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. చ‌ర‌ణ్‌సినిమాలో గెస్ట్ రోల్ చేసినా - ఈ క‌త్తి రీమేక్‌లో కూడా చిరు న‌టిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈనెల 22న చిరు పుట్టిన రోజు. ఆ సంద‌న్భంగా త‌న 150వ సినిమా ఎవ‌రితో అనే విష‌యాన్ని చిరు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.