English | Telugu

దీప్తికి చిరంజీవి ఆర్ధిక సాయం..తెలుగు వారి కీర్తిని చాటి చెప్పింది 

2024 కి సంబంధించి గత ఏడాది పారిస్ లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పారా అథ్లెట్ ఒలింపిక్స్‌ పోటీల్లో ఇండియా తరుపున పాల్గొన్న తెలుగు అమ్మాయి దీప్తి జీవాంజి(deepthi jeevanji)వ‌రంగ‌ల్‌కి దగ్గరలో ఉన్న కల్లెడ అనే ఒక చిన్న విలేజ్ కి చెందిన దీప్తి 400 మీటర్ల టీ20 విభాగంలో 55.06 సెకన్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి దేశం యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది.

ప్రముఖ బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపి చంద్(pullela gopichand)ఆధ్వర్యంలో దీప్తి ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడం జరిగింది.దీంతో మెడ‌ల్ సాధించిన సంద‌ర్భంగా దీప్తి కి ఏం కావాలని గోపీచంద్ అడగగానే చిరంజీవిగారిని క‌ల‌వాల‌నుంద‌ని దీప్తి చెప్పడం జరిగింది.ఈ విషయాన్నీ గోపీచంద్ ఒక సందర్భంలో చిరంజీవి(chiranjeevi)గారిని కలిసినప్పుడు చెప్పాడు.దీంతో చిరు పెద్ద మ‌న‌సుతో స్పందించి,చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసిన‌ప్పుడు,దీప్తి రావ‌టం కాదు,నేనే అకాడ‌మీకి వ‌స్తాన‌ని చిరు రీసెంట్ గా వెళ్ళాడు. దీప్తి తో పాటు అక్కడున్న మిగతా వాళ్ళని కూడా కలిసి రెండు గంట‌ల పాటు అక్క‌డే గ‌డిపారు.ప్ర‌తీ ఒక్క ప్లేయ‌ర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడాడు.ఆ తర్వాత దీప్తికి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చారు.

ఈ సందర్భంగా గోపి చంద్ మాట్లాడుతు ఇది మా స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌర‌వంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేష‌న్‌తో చాలా మంది మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌నే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.