English | Telugu

700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో బుల్లితెర నటి రీతూ చౌదరి?

ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్‌లో ఇరుక్కుంది బుల్లితెర నటి రీతూ చౌదరి. విజయవాడ, ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లను ఓ ముఠా కొట్టేసిందనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు, చీమకుర్తీ శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద ఆస్తులు ఉన్నాయన్నారు.

రీతూ అసలు పేరు వనం దివ్య.. చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య అంటూ మీడియాకి చెప్తున్నారు. ఇప్పటివరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ వచ్చిన రీతూ అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖతో.. ఏపీ సర్కార్‌ అలర్ట్‌ అయింది. దీంతో సినీ నటి రీతూ చౌదరి పేరు ఏపీ రాజకీయాల్లోనే కాదు... తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమోగుతోంది. ఐతే రీసెంట్ గా రీతూ "సుఖ ఫార్మ్ స్టే" పేరుతో టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ శివాజీ రాజా కుమారుడు విజయ రాజాతో ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇక ఇపుడు వస్తున్న ఈ న్యూస్ మీద రీతూ చౌదరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.