English | Telugu

సమంత ఛార్మిల ఐటెంసాంగ్..!

'ఐ' మూవీ తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమా 'పత్తుఎన్‌రాధుకుల్లా'. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందట. ఈ పాట కోసం పూణెలో రూ.2.5 కోట్లు వెచ్చించి మరీ ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సాంగ్ దాదాపు 9 నిమిషాలపాటు కొనసాగుతుందట. ఈ పాటకోసం చార్మీని సంప్రదించగా.. కాన్సెప్ట్ తెగ నచ్చేయడం వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ స్పెషల్ సాంగ్ లో ఛార్మీ తో పాటు సమంత కూడా స్టెప్స్ వేయనుంది. అక్టోబర్ 20 తర్వాత ఈ పాటని చిత్రీకరిస్తారు. నవంబర్ కల్లా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.