English | Telugu

వాడి జోలికి ఎవడైనా వస్తే ప్రాణాలు తీస్తా.. మంచు మనోజ్ మాస్!

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'. తమిళ మూవీ 'గరుడన్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న భైరవం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. (Bhairavam Teaser)

దాదాపు నిమిషంన్నర నిడివితో ఉన్న 'భైరవం' టీజర్.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో పక్కా మాస్ బొమ్మలా ఉంది. ముగ్గురి పాత్రలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. నారా రోహిత్, మంచు మనోజ్ అన్నదమ్ములుగా కనిపిస్తుండగా, వారికి అండగా నిలబడే హనుమంతుడి తరహా పాత్రలో శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. "శీను గాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే ప్రాణాలు తీస్తా" అంటూ మనోజ్ చెప్పే డైలాగ్, "ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోడానికి శీనుగాడు ఉన్నాడు." అంటూ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచాయి. ఇక కాంతారా చిత్రాన్ని గుర్తు చేస్తూ శ్రీనివాస్ షాట్ తో టీజర్ ను ముగించిన తీరు బాగుంది. మరి ఈ ముగ్గురు హీరోలు కలిసి ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'భైరవం'తో బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.