English | Telugu

అంబటి రాంబాబుని బండ్ల గణేష్ అంత మాట అన్నాడా!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి వ్యతిరేకంగా తన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్ లో బండ్ల గణేష్ పేరుతో ఓ షాకింగ్ కామెంట్ కనిపించింది. చాలామంది ఇది బండ్ల కామెంటే అనుకున్నారు. అయితే బండ్ల మాత్రం ఆ కామెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

"హలో.. లోకేష్ గారు!. తమరి లొకేషన్ ఎక్కడ?" అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కి "ఏ వెళ్ళి కడుగుతావా" అంటూ బండ్ల గణేష్ పేరుతో దారుణమైన రిప్లై వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో బండ్ల స్పందించారు. "ఈ ట్వీట్ కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి తప్పుడు ట్వీట్స్ నా పేరు మీద వేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు" అని బండ్ల ట్వీట్ చేశారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.