English | Telugu

శాతకర్ణి కోసం ఎక్సర్ సైజ్ చేస్తున్న బాలయ్య..!

నందమూరి నటసింహం వందో సినిమా శాతకర్ణిని చాలా ప్రేస్టేజియస్ గా తీసుకున్నారు. పూర్తిగా శాతకర్ణి చరిత్రలో మునిగిపోయారు బాలయ్య. క్రిష్ కథ చెప్పిన విధానం కూడా ఆయన్ను కట్టిపడేసిందని సమాచారం. అంతలా నచ్చింది కనుకే, బోయపాటి, కృష్ణవంశీ లాంటి దర్శకుల్ని పక్కన పెట్టి ఈ కథకు తలూపారు. ఇక సినిమా కోసం తనను తాను మార్చుకునే పనిలో కూడా బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ఒక చక్రవర్తి ఎలా ఉంటాడో అలాంటి రాజసంతో సినిమాలో కనిపించాలనేది బాలయ్య ఆలోచన. దీని కోసం బరువు తగ్గించుకోవడంతో పాటు, ఉదయం సాయంత్రం వేళల్లో పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తున్నారట బాలయ్య. కార్డియో, వెయిట్స్ తో పాటు, యోగాను కూడా అభ్యసిస్తున్నారట. గతంలో భైరవద్వీపం లాంటి సినిమాల్లో ఆయన గుర్రపు స్వారీ చేసినా, యుద్ధ సన్నివేశాల్లో గుర్రాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి, పూర్తి స్థాయి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. కత్తి తిప్పడం లాంటివాటికి మాత్రం ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరంలేదని బాలయ్య చెప్పినట్టు సమాచారం. తెలుగు వారి గొప్పదనాన్ని చాటే చిత్రం అని మొదటినుంచీ చెప్తూ వస్తుండటంతో, ఆ మాటను నిలబెట్టుకోవడంలో ఎక్కడా తేడా రాకూడదని బాలయ్య క్రిష్ కు స్పష్టం చేశారట. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, బాలయ్య సరసన అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. బాలయ్య తల్లి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని తీసుకోవడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.