English | Telugu

ఆ నిర్మాతకు షాక్ ఇచ్చిన బాలయ్య..?

బాలయ్య వందో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, క్రిష్ తోనే ఉంటుదన్నది కన్ఫామ్ అయిపోయింది. గతంలో బాలయ్య వందో సినిమా తానే తీయబోతున్నానని, ఆయన తనయుడు మోక్షును కూడా తానే ఇంట్రడ్యూస్ చేస్తున్నానని కొర్రపాటి సాయి ప్రకటించేశారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, బాలయ్య సాయికి షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ' కంచె ' నిర్మించిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి లకే బాలయ్య వందో సినిమా నిర్మాణ బాధ్యతలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇది క్రిష్ సొంత సంస్థగానే చెప్పచ్చు.

సాయి కొర్రపాటి నిర్మాణంలో బాలకృష్ణ లెజండ్ తీసిన విషయం తెలిసిందే. అంతేకాక సాయి నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అందుకే అంత ధైర్యంగా తానే వందో సినిమాను తీస్తున్నానని ప్రకటించగలిగారు. ఆ సినిమాకు కృష్ణవంశీ ఓకే అయి ఉంటే ఆయన చెప్పింది నిజమై ఉండేది. కానీ సడెన్ గా, రాజుల కథతో క్రిష్ రంగంలోకి రావడం, తన సొంత నిర్మాణ సంస్థ కావాలని బాలయ్యను రిక్వెస్ట్ చేయడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో కొర్రపాటికి బాలయ్య హ్యాండ్ ఇవ్వక తప్పలేదు. వందో సినిమా మిస్ అయినా, తర్వాత రాబోయే 101, 102 సినిమాల్ని సాయి నిర్మించే అవకాశం ఉంది. కృష్ణవంశీ, సింగితం శ్రీనివాసరావు సినిమా కథల్ని బాలయ్య తనే చేయాలని ఫిక్స్ అయి లాక్ చేసుకున్నారట. సో, సాయికి వంద మిస్ అయినా, వరస జాక్ పాట్ లు కొట్టే ఛాన్స్ మాత్రం మిస్సవ్వలేదన్నమాటే..

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.