English | Telugu

అభిమాని కోరికని బాలయ్య నెరవేర్చబోతున్నాడా! యూత్ ఫుల్ అంటే మాములుగా ఉండదు 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)ప్రస్తుతం 'అఖండ'(Akhanda)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'అఖండ పార్ట్ 2'(Akhanda part 2)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సింహ, లెజండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ని అందించిన బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబోలో అఖండ పార్ట్ 2 తెరకెక్కుతుండంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని ఖాయమయ్యింది. ఇక బాలయ్య అఖండ 2 తర్వాత 'గోపీచంద్ మలినేని'(Gopichand Malineni)దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో 'వీరసింహరెడ్డి' లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

కానీ 'గోపిచంద్ మలినేని' మూవీ కంటే ముందే బాలయ్య మరో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి. 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. విశ్వక్ సేన్(Vishwak Sen)అభినవ్, వెంకటేష్ ,సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లోనే బాలయ్య ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించిన న్యూస్ బాగానే వైరల్ అవుతుంది. మరి బాలయ్య తమ మూవీలో చేస్తున్నాడని మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇక బాలయ్య, విశ్వక్ సేన్ మధ్య ఎప్పట్నుంచో మంచి అనుబంధం ఉంది. విశ్వక్ సేన్ గత మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్ లో బాలయ్య కూడా విశ్వక్ తో ఉన్న అనుబంధం గురించి బహిరంగంగానే చెప్పాడు. పైగా విశ్వక్ సేన్ పక్కా బాలయ్య అభిమాని. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి కాంబోలో 'ఈ నగరానికి ఏమైంది' లాంటి యూత్ ఫుల్ సినిమాకి సీక్వెల్ వస్తే సరికొత్త రికార్డులు తిరగరాసినట్టే అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.