English | Telugu

బాహుబ‌లి కోసం.. 5వేల థియేట‌ర్లు

స‌రికొత్త చ‌రిత్ర దిశ‌గా బాహుబ‌లి అడుగులు వేస్తోంది. విడుద‌ల‌కు ముందే అన్ని రికార్డుల‌నూ త‌న పేర లిఖించుకోవ‌డానికి ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికే... బ‌డ్జెట్ విష‌యంలో బాహుబ‌లి స‌రికొత్త రికార్డులు సృష్టించింది. రూ.250 కోట్ల సినిమా అంటూ.. అంద‌రూ బాహుబ‌లిని కీర్తిస్తున్నారు. మ‌రి ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాని ఎక్కువ మందికి చేరువ కావాలి క‌దా. అందుకే విడుద‌ల విష‌యంలోనూ చిత్ర‌బృందం క‌నీవినీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు టాక్‌.

బాహుబ‌లిని ప్ర‌పంచ వ్యాప్తంగా 5000 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి ఆర్కా మీడియా ప్లాన్ చేస్తోంది. ఆంధ్ర‌, తెలంగాణా రాష్ట్ర్రాల్లోనే దాదాపుగా 1900 థియేట‌ర్ల‌లో బాహుబ‌లిని ప్ర‌ద‌ర్శిస్తారు. బాలీవుడ్‌తో పాటు... అన్ని రాష్ట్ర్రాల్లోనూ, విదేశాల్లోనూ మొత్తంగా 3వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

మొత్తంగా తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లు వ‌సూలు చేయ‌డానికి బాహుబ‌లి టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లు వేసుకొంది. మ‌రి రాజ‌మౌళి ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఇంకో ప‌ది రోజులు ఆగితే స‌రిపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.