English | Telugu

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా..?

గతేడాది తెలుగురాష్ట్రాలతో పాటు, యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించింది బాహుబలి సినిమా. తెలుగు సినిమా స్టామినా ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. గత కొద్ది కాలంగా, బాహుబలికి వచ్చినంత పబ్లిసిటీ, బహుశా మరే సినిమాకూ రాలేదేమో. ఆ పబ్లిసిటీలో సగం క్రిడిట్, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకే ఇవచ్చు. ఇది ఇండియా వైడ్ ట్రెండింగ్ లో నిలిచిన కొచన్. తాజగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే దిశగా, జక్కన్న రాజమౌళి తన పనులు వేగవంతం చేశాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి కి మరో భాగం రానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించిన జక్కన్న ప్లాన్ ఇప్పుడు లేట్ అయ్యేలా ఉంది. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత కూడా ఏవో మార్పులు చేర్పులు చేయడం రాజమౌళికి అలవాటు. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నా, జక్కన్నకున్న చెక్కే అలవాటు కారణంగా సినిమా రిలీజ్ ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది వేసవికి వెళ్లిపోయింది.

రెండో పార్ట్ కు ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా, గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయి. దీంతో మూవీ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 14, 2017గా ఫిక్స్ చేసింది మూవీ టీం. అఫీషియల్ గా ప్రకటించకపోయినా, బాలీవుడ్ వర్గాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మొదటి పార్ట్ కు ఇండియా వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్లు విడివిడిగా రిలీజ్ చేసిన జక్కన్న, రెండో పార్ట్ కు మాత్రం, అన్ని చోట్లా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయక తప్పదేమో..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.