English | Telugu

బ‌హుబ‌లీ.. ఏమిటీ క‌క్కుర్తి?!

యూట్యూబ్‌లో బాహుబ‌లి ట్రైల‌ర్ క‌నిపించ‌క‌పోవ‌డం... అభిమానుల్ని షాక్‌కి గురిచేసింది. త‌మ సినిమాపై దిష్టి త‌గిలింద‌ని ఫ్యాన్స్ కాస్త ఓవ‌ర్‌గా ఆలోచించి కంగారు ప‌డుతున్నారు. యూ ట్యూబ్ నిబంధ‌న‌లుకు లోబ‌డి ఈ ట్రైల‌ర్‌ని అప్ లోడ్ చేయ‌లేద‌న్న‌ది ప్రాధ‌మిక స‌మాచారం. అయితే.. ఎక్కువ హిట్స్ కోసం అడ్డదారులు తొక్కినా... యూ ట్యూబ్ లో వీడియోలు క‌నిపించ‌వు. రెండో కార‌ణంతోనే యూ ట్యూబ్ ఆ ట్రైల‌ర్‌ని తొల‌గించింద‌ని ఇంకొంద‌రి వాద‌న‌. తొలి రోజే ప‌ది ల‌క్ష‌ల వ్యూవ్‌పైగానే సాధించి బాహుబ‌లి సంచ‌ల‌నం సృష్టించింది. ఈసినిమాపై ఉన్న హైప్‌ని దృష్టిలో ఉంచుకొంటే ఆ మాత్రం వ్యూవ్స్ గ్యారెంటీగా వ‌స్తాయి. ఎక్క‌డ అనుకొన్న‌న్ని హిట్స్ రావేమో అని బాహుబ‌లి చిత్ర‌బృంద‌మే కావాల‌ని.. అడ్డాదారి తొక్కి హిట్స్ పెంచుకొంద‌ని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాజ‌మౌళి & టీమ్ ఎక్క‌డో బాహుబ‌లి విష‌యంలో కాస్త అసంతృప్తికీ, కొన్ని అనుమానాల‌కూ లోన‌వుతున్నార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ప‌ది ల‌క్ష‌ల హిట్స్ క‌నుక రాక‌పోతే హైప్ ఎక్క‌డ ప‌డిపోతుందో అన్న భ‌యాలూ ఉండొచ్చు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయ‌న్న‌ది వాస్త‌వం. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి రాజ‌మౌళి ప్ర‌య‌త్నాలు చేయ‌కపోగా, ఇలాంటి ట్రిక్కుల‌తో.. ప్రేక్ష‌కుల‌కు లేనిపోని అనుమానాలు వ‌చ్చేలా చేస్తున్నాడు. బాహుబలి ట్రైల‌ర్ ఎందుకు క‌నిపించ‌డం లేదో, అందుకు సంబంధించిన టెక్నిక‌ల్ విష‌యాలేంటో రాజమౌళే స్వ‌యంగా చెప్పాలి. లేదంటే.. ఈ క‌న్‌ఫ్యూజ‌న్లు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.