English | Telugu

మరో అత్యాచారం కేసులో అరెస్ట్‌ వారెంట్‌.. పరారీలో ప్రముఖ నటుడు!

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు, లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎవరు ఎవరిమీద ఆరోపణలు చేస్తారో, ఎప్పుడు ఎవరి కేసు వెలుగులోకి వస్తుందీ అనే విషయం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో జానీమాస్టర్‌, శ్రష్టివర్మ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో, మీడియాలో దీనిపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. జస్టిస్‌ హేమ కమటీ రిపోర్ట్‌ మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృస్టించిన విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఆ రిపోర్ట్‌ బయటపెట్టింది. ఈ నివేదిక బయటికి రాగానే ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ.. ప్రముఖ నటుడు సిద్ధిఖ్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా, కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సిద్ధిఖ్‌ పరార్‌ అయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నదేమిటంటే.. తనకు ఓ తమిళ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తన లైంగిక అవసరాలు తీర్చమని కోరాడు. దానికి ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో ఓ హోటల్‌లో తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఇది 2016లో జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది.

మలయాళ ఇండస్ట్రీలో సిద్ధిఖ్‌కి నటుడుగా చాలా మంచి పేరు ఉంది. 61 ఏళ్ళ సిద్ధిఖ్‌ 1980లో చిత్ర పరిశ్రమలోకి నటుడుగా అడుగుపెట్టారు. పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. 45 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగులో రాజేష్‌ టచ్‌రివర్‌ రూపొందించిన ‘నా బంగారు తల్లి’ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు సిద్ధిఖ్‌. వ్యభిచారులను సప్లై చేసే వ్యక్తిగా, హీరోయిన్‌కి తండ్రిగా ఈ సినిమాలో నటించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.